Monday, April 29, 2024

First test – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ – ఇషాన్ , యశస్వి ల అరంగేట్రం

విండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ తో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ లు టెస్టు ఫార్మాట్ లో అరంగేట్రం చేయనున్నారు. రిషభ్ పంత్ గాయం తర్వాత అతడి స్థానంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎస్ భరత్ పై వేటు పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టులు.. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో విండీస్ తో జరిగే సిరీస్ లో ఇషాన్ కిషన్ ను వికెట్ కీపర్ గా తీసుకుంది. అతడితో పాటు ఈ ఏడాది ఐపీఎల్ లో దంచి కొట్టిన యశస్వి జైస్వాల్ కు కూడా అరంగేట్రం చేసే ఛాన్స్ దక్కింది.

ఓపెనర్ గా ఉన్న శుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. పుజారాను తప్పించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో అతడి స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారని అభిమానుల మధ్య తీవ్ర చర్చ కూడా నడిచింది. అయితే గిల్ ను ఆ స్థానంలో బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని గిల్ కూడా పేర్కొన్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు అతడు వ్యాఖ్యానించాడ

తుది జట్లు

వెస్టిండీస్ బ్రాత్ వైట్ (కెప్టెన్), చంద్రపాల్, రెమాన్ రీఫర్, బ్లాక్ వుడ్, అలైక్ అతనాజె, జేసన్ హోల్డర్, జాషువా సిల్వా, కార్న్ వాల్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జొమెల్ వారికాన్

- Advertisement -

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, రహానే, కోహ్లీ, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, జడేజా, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement