Sunday, May 5, 2024

పసుపు మంట

పసుపుమంటలు ఇందూరు నుండి హస్తినకు తాకాయి. పార్లమెంట్సాక్షిగా పసుపురాజకీయం భగభగలాడుతోంది. నిజామాబాద్ లో పసుపుబోర్డు ఏర్పాటుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మంగళ వారం లోకసభలో కాంగ్రెస్ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నలు సంధించగా.. పసుపుబోర్డు ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్పెసెస్ఎక్స్ టెన్షన్ సెంటర్ లోనే పసుపుకు సంబంధించిన అంశం కూడా ఉందని చెప్పింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2019 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు.. ఈ సందర్భంగా జరిగిన చర్చ తెలంగాణ రాజకీయాలను కూడా హాట్ హాట్ గా మార్చింది. స్పెసెస్ ఎక్స్ టెన్షన్ సెంటర్వచ్చిన సందర్భంలోనే.. పసుపుబోర్డుపై కేంద్రం తన వైఖరిని బద్దలు కొట్టగా, ఇటీవల నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు ఏర్పాటు చేయాల్సిందే అంటూ దీక్షలకు, ఆందోళనలకు దిగారు. వారితో అరవింద్ చర్చలు కూడా జరిపారు. తర్వాత పసుపు ధర కొంత మెరుగుపడడంతో రైతులు కాస్త నెమ్మదించారు. ఇపుడు పార్లమెంట్ సాక్షిగా అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్పసుపుబోర్డు డిమాండ్ ను పతాకస్థాయికి తీసుకెళ్ళగా, కేంద్రం చేసిన ప్రకటనపై.. మండిపడుతున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర కావాలా.. పేరు కావాలా అంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల ఉత్తమ్ప్రశ్నపై స్పందించారు. కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల సమాధానమిస్తూ.. స్పైసెస్ బోర్డ్ (మసాలా బోర్డు) పరిధిలో పసుపుతో పాటు మొత్తం 50 పంటలున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సాగయ్యే పసుపు కోసమే మసాలా బోర్డు డివిజనల్కార్యాలయాన్ని రీజనల్ కార్యాలయంగా మార్చి ఎక్స్టెన్షన్సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యాలయం పసుపు పంట మీదనే దృష్టి పెట్టి పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గురించి చేసిన ఆరోపణలకు బదులిస్తూ.. పసుపు పంటకు ధరలు తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొస్తే.. అప్పుడు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అటు ఉత్తమ్, ఇటు కేంద్ర మంత్రి మధ్య హాట్ హాట్ గా చర్చ జరగ్గా, అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యేలు కూడా పసుపుబోర్డు అంశంపై మాట్లాడారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పసుపురైతుకు దన్నుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. పసుపుబోర్డు రాదనేది.. కేంద్రం ప్రకటనతో తేలిపోయింది.. ఇక తేల్చుకోవాల్సింది రైతులే. హామీనిచ్చి నిలబెట్టుకోలేని ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీ అరవింద్వి రుచుకుపడ్డారు. మరోవైపు కవిత ఎంపీగా ఉన్నపుడు పసుపురైతులకు మద్దతుగా ఎంతో కృషిచేసిందని, అరవింద్ పసుపురైతులను వంచించారని నిజామాబాద్ టీఆర్ఎస్ఎ మ్మెల్యేలు అంటున్నారు. పసుపు రాజకీయం మూడుపార్టీల మధ్య వేడి పుట్టిస్తోంది. ఇదీ కేంద్రం వాదన పసుపుతోపాటు అన్నిరకాల మసాలా దినుసుల పంటలను విక్రయించడం, ఎగుమతి చేయడం కోసం భారత్ఎ లక్ట్రానిక్స్ తో కలిసి ‘ఈ-స్పైస్ మండీ’ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి 5,000 మంది రైతులు నమోదు చేసుకున్నారని కేంద్రమంత్రి రూపాల ప్రకటించారు. జాతీయ స్థాయిలో అన్నిరాష్ట్రాల రైతులకు ఈ-స్పైస్ మండీ ఉపయోగపడుతుందని తెలిపారు.

పసుపుతో పాటు ఇతర మసాలా దినుసులపై పరిశోధన, అభివృద్ధి, సాగు విధానాలు, మార్కెటింగ్,ఎగుమతులను ప్రోత్సహించడం కోసం నిజామాబాద్ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తుంది. ‘మిషన్ ఫర్ఇంటి గ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్’ (ఎంఐడీహెచ్) కింద కేంద్ర వ్యవసాయశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. పోస్ట్ హార్వెస్టింగ్ పనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోంది. తద్వారా పసుప పంటకు మెరుగైన ధర లభించేందుకు సహకరిస్తోంది. ‘నేషనల్ చేయాలు అగ్రికల్చర్ మార్కెట్ (ఈనామ్) ద్వారా ఇటు రైతులు , అటు”పాయనట్లు కనిపిస్తోందని అన్నాకొనుగోలుదారులకు సదుపాయాలు కల్పిస్తోంది. తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందవ్ తన పదవికి రాజీనామాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement