Friday, May 3, 2024

Breaking: జీడిమెట్ల కెమికల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్​లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మంగళవారం ఫైర్​ యాక్సిడెంట్​ జరిగింది. లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ లో కెమికల్స్ తో ఎంవోటీ ప్రాసెస్ చేసే క్రమంలో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఏరియాలో మంటలు ఎగిసిపడుతుండగా.. పెద్ద పొంగ వ్యాపించింది. కాగా, కంపెనీలో ఇద్దరు వర్కర్స్​ మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవడానికి ట్రై చేస్తున్నారు. రూ.14 లక్షల మేరకు ఆస్దినష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement