Friday, April 26, 2024

ఫుడ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం 52 మంది దుర్మరణం

బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ అగ్నిప్రమాద ఘటనలో 52 మంది దుర్మరణం పాలయ్యారు. రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. ఘటన జరిగిన సమయంలో చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: కాళేశ్వరం వల్ల నో యూజ్: మాజీ పీసీసీ చీఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement