Sunday, April 28, 2024

National : యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం… ఆరుగురు స్పాట్ డెడ్‌….

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌ల్లియా జిల్లా బైరియాల పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో జీపు కారు-పిక‌ప్ ట్ర‌క్‌లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా 8మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈఘ‌ట‌న మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3గంట‌ల ప్రాంతంలో చోటుచేసుకుంది.

ప్ర‌మాదంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం న‌లుగురిని మ‌రో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరంతా వివాహ‌వేడుక‌ల్లో పాల్గొని తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement