Friday, May 3, 2024

Road Accident: యూపీలో ఘోర రోడ్డుప్ర‌మాదం…ఆరుగురు మృతి…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజాము అదుపు త‌ప్పి ఓ కారు నీరున్న గోయ్యిలో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్కడిక్క‌డే మృత్యువాత ప‌డ్డారు. ఈఘ‌ట‌న కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలో జగన్నాథ్​పుర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు నీటి గుంటలో పడిపోయింది. వర్షం పడటం వల్ల అక్కడ నీటి గుంట ఉన్నట్లు వాహనదారుడు గమనించకపోయి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీసి గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆరుగురి మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో జోరుగా వర్షం కురుస్తుండటం మరోవైపు కారు అదుపు తప్పడంతో గొయ్యిలో పడినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారో త్వరలోనే గుర్తిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement