Monday, April 29, 2024

AP | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

తాడిపత్రి, ప్రభ న్యూస్‌ : తాడపత్రి మండల పరిధిలోని రావి వెంకటంపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం తాడిపత్రి హైవే పౖ అదుపుతప్పి కారు చెట్టును ఢీకొనడంతో తాడపత్రి పట్టణానికి చెందిన నరేష్‌(30), రమేష్‌ నాయుడు(32) మోహన్‌ రెడ్డి (31) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… తాడిపత్రి పట్టణానికి చెందిన మోహన్‌రెడ్డి అనంతపురంలో కారు కొనుగోలు చేశాడు.

అనంతపురం నుంచి ఆ కారును తీసుకోవడానికి తన మిత్రులైన నరేష్‌, రమేష్‌ నాయుడు, మధుసూదన్‌ రెడ్డి లను వెంటబెట్టుకొని శుక్రవారం బయలుదేరి వెళ్లాడు. కారు కొన్న సందర్భంలో మోహన్‌ రెడ్డి తన మిత్రులతో అనంతపురంలో పార్టీ చేసుకొనితిరిగి ఏపీ02 సిడి 1513 అనే నెంబరు గల కారులో తాడిపత్రికి వస్తుండగా శనివారం తెల్లవారుజామున రావి వెంకటాంపల్లి గ్రామంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగాన్ని అదుపు చేసుకోలేక రోడ్డు ప్రక్కలే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మధుసూదన్‌ రెడ్డి అనే వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో అనంతపురంలోని సవేరా అనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధుసూదన్‌ రెడ్డి కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాడపత్రి డిఎస్పి సీఎం గంగయ్య, రూరల్‌ సిఐ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్సై తో పాటు పలువురు పోలీసులు ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

- Advertisement -

మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదంలో మృతి చెందిన నరేష్‌ రమేష్‌ నాయుడు మోహన్‌ రెడ్డి మృతదేహాలను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement