Saturday, April 27, 2024

Breaking | తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 8మంది మృతి

తమిళనాడులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఊటీ నుంచి మెట్టుపాళ్యం వెళ్తున్న టూరిస్టు బ‌స్సు ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డింది. 55 మంది పర్యాటకులతో వెళ్తున్న ఈ బస్సు కూనూర్ మెట్యుపాళ్యం సమీపంలో లోయ‌లో పడిపోవడంతో 35 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 8 మంది అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తోంది.

కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని సమాచారం అందుతోంది. ప్ర‌స్తుతం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కూనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement