Saturday, May 18, 2024

సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్‌.. అప్రమత్తంగా ఉండాలంటూ సీజేఐ హెచ్చరిక

సైబర్‌ నేరగాళ్ల అరాచకాలకు అంతులేకుండా పోతున్నది. ఇప్పటి వరకు అనేక సంస్థలు, వ్యక్తులు, బ్రాండ్ల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్న ఈ మోసగాళ్లు.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్నే టార్గెట్‌ చేశారు. ‘సుప్రీం కోర్టు’ పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ వెల్లడించారు. సదరు నకిలీ వెబ్‌సైట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లాయర్లు, వ్యాజ్యదారులను హెచ్చరించారు. అటు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా దీనిపై పబ్లిక్‌ నోటీసు జారీ చేసింది.

”సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఎవరూ షేర్‌ చేయొద్దు. అందులో రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎన్నడూ ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. రహస్య వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడగదు” అని రిజిస్ట్రీ తమ నోటీసులో పేర్కొంది. ఒకవేళ సైబర్‌ దాడికి గురైతే గనుక.. వెంటనే మీ అన్ని ఆన్‌లైన్‌ ఖాతాలు, బ్యాంక్‌ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చుకోండి” అని రిజిస్ట్రీ సూచించింది. ఈ నకిలీ వెబ్‌సైట్‌ గురించి ఇప్పటికే దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లామని, దీని వెనుక బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement