Saturday, April 27, 2024

ఫ్యాక్ట్ చెక్: ఏపీలో కర్ఫ్యూ సమయం తగ్గించారంటూ ప్రచారం

కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీంతో ఉ.6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. తాజాగా ఈ కర్ఫ్యూను ఈనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈనెల 20 నుంచి కర్ఫ్యూ సమయాన్ని ఉ.6 గంటల నుంచి ఉ.10 గంటల వరకు మాత్రమే కుదించినట్లు మంగళవారం నాడు పలు వాట్సాప్ గ్రూప్‌లలో వార్తలు హల్‌చల్ చేసింది. అయితే ఈ వార్త నిజం కాదని, కర్ఫ్యూ సమయం తగ్గింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఓ ప్రతినిధి ఇచ్చిన తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement