Monday, April 29, 2024

డైమండ్స్‌, ఆభరణాల ఎగుమతులు తగ్గొచ్చు

అమెరికా, చైనా వంటి కీలక మార్కెట్లలో డిమాండ్‌ మందగించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని జీజేఈపీసీ చైర్మన్‌ విపుల్‌ షా తెలిపారు. జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (జిజెఇపిసి) ప్రకారం, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు సంవత్సరానికి 2.48 శాతం వృద్ధి చెంది, 2023లో రూ. 3,00,462.52 కోట్లకు (36 బిలియన్‌ డాలర్లకు పైగా) పెరిగాయి.

సోమవారం సాయంత్రం ఇక్కడ జరిగిన ఒక ఈవెంట్‌లో మీడియాతో మాట్లాడిన జిజెఇపిసి చైర్మన్‌, 2023-24లో రత్నాలు, ఆభరణాల సెగ్మెంట్‌ ఎగుమతుల కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ 42 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలియజేశారు. మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతి బుట్టలో వజ్రాలు 55 శాతానికి పైగా ఉన్నాయని షా తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement