Monday, May 13, 2024

విజృంభించిన సాల్ట్.. సొంత గడ్డపై ఢిల్లీ సూపర్ విక్టరీ

సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తన తడాఖా ఏంటో చూపించింది. ఇవ్వాల్టి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని చిత్తు చిత్తుగా ఓడించింది. తమ పవర్ హిట్టింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపారు ఢిల్లీ బ్యాటర్లు. సాల్ట్, మార్ష్, రుస్సో జోరుతో 182 పరుగుల టార్గెట్ ను 16.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది ఢిల్లీ. 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్లలో సాల్ట్ (45 బంతుల్లో 87 పరుగులు ; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రిలీ రుస్సో (22 బంతుల్లో 35 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (17 బంతుల్లో ; 3 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ వార్నర్ (14 బంతుల్లో 22 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్, హర్షల్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 55 పరుగులు ; 5 ఫోర్లు), డుప్లెసిస్ (32 బంతుల్లో 45 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మహీపాల్ లోమ్రర్ ( 29 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, ఈ మ్యాచులో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఏడు వేల పరుగుల మార్క్ ని అందుకున్న తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక, ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ లకు చెరో వికెట్ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement