Monday, May 20, 2024

TS | బెంగళూరులో పేలుళ్లు.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌

బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

కాగా, బెంగళూరులోని కుండలహళ్లిలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆగంతకులు టిఫిన్ బాక్స్ బాంబును పేల్చారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఐఈడీతో దాడి జ‌రిపార‌ని.. పేలుడు ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement