Monday, April 29, 2024

మొక్కుబడికి మాస్క్ పెట్టుకుంటే… మీ పని అయిపోయినట్టే !!

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లు, భౌతిక దూరం తప్పనిసరి అంటూ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మాస్క్ లు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానాలు కూడా పోలీసులు విధిస్తున్నారు. కాగా పోలీసులు ఉన్నారనో, లేక ఏదో పెట్టుకోవాల్సి వచ్చిందన్న విధంగా సగం మాస్క్ ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు.

మాస్క్ ముక్కు నోటి ని కవర్ చేసే విధంగా కాకుండా నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే పెట్టుకున్నా… మాస్క్ లేని వారిగానే పరిగణించి వారికి కూడా వెయ్యి రూపాయల జరిమానా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ముక్కు నోరు కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకోవాలి. లేకపోతే మీరు కూడా జరిమానా కట్టాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement