Thursday, April 18, 2024

ఈటెల రాజేందర్‌కు క్షీణించిన ఆరోగ్యం.. పాదయాత్రకు బ్రేక్

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఇటీవల ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాదయాత్ర కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. ఈటెల రాజేందర్ ప్రస్తుతం జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీణవంక మండలం కొండపాక వరకు పాదయాత్ర కొనసాగించిన ఆయన శనివారం మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం బాగా నీరసించిపోయారని వెల్లడించారు.

కాగా ఈటెలకు వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారని తెలుస్తోంది. కాగా తన భర్త జ్వరం బారిన పడడంతో ఆయన బదులు ఈటెల సతీమణి జమున పాదయాత్ర కొనసాగిస్తారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చర్చ నడుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement