Sunday, April 28, 2024

UP: కోర్టులో ఏనుగు ఎంట్రీ…భ‌యంతో ప‌రుగులు తీసిన న్యాయ‌మూర్తులు, లాయ‌ర్లు

ఉత్తరాఖండ్‌లోని ఓ కోర్టులో అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు దూసుకువ‌చ్చింది..హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులో నేడు ఈ ఘటన జరిగింది.

రాజాజీ టైగర్ రిజర్వ్ నుండి బయటికి వచ్చిన అడవి ఏనుగు ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి చొరబడింది. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. చివ‌రికి కోర్టు హాలులో కూడా ప్ర‌వేశించింది.. ఏనుగు అల‌జ‌డికి క‌క్షిదారులు, లాయ‌ర్లు, న్యాయ‌మూర్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు..కొంద‌రు అక్క‌డి నుంచి పారిపోయారు.. ఇక కోర్టు గేట్లను తోసేసి గోడను కూడా ధ్వంసం చేసింది.. ఈ సమ‌యంలో అట‌వీ సిబ్బంది,పోలీసుల వ‌చ్చి ఏనుగును అక్క‌డి నుంచి త‌రిమివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement