Friday, May 3, 2024

Chandrababu: అప్పుడు హేళ‌న చూశారు…ఐటిలో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ అయింది..

బెంగళూరు: ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరు లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన‌ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ,. ‘‘రైతు కుటుంబంలో పుట్టి.. ఐటీని ప్రోత్సహించాను.

అప్పట్లో ఐటీని ఏర్పాటు చేస్తానన్నప్పుడు.. విజన్‌-2020 అన్నప్పుడు.. నన్ను హేళన చేశారు. ఇప్పుడు ఆ ఐటి తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్ చేసింది…దేశంలోనే హైద‌రాబాద్ రెండో స్థానంలో నిలిచింది..నాయ‌కుడికి ముందు చూపు ఉండాలి…వాస్త‌వం నుంచి భ‌విష్య‌త్ ను చూడాలి..అప్ప‌డే ప్ర‌జ‌లు మేలు జ‌రుగుతుంది. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే’’ అని అన్నారు.. ఇక ప్ర‌స్తుతం ఎపిలో వైకాపా పాలనతో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయన్నారు.. . పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయమని పేర్కొన్నారు…ప్ర‌తి ఒక్క‌రూ పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement