Sunday, April 28, 2024

Elections – ఎగ్జిట్ పోల్స్‌ నిషేధం – ఈసీ ఆంక్ష‌లు

సార్వత్రిక ఎన్నికల వేళ‌ ఎగ్జిట్‌ పోల్స్ నిషేధిస్తూ.. ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్‌ రోజు అయిన జూన్‌ 1 సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే.. పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతోపాటు ఇతర ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయొద్ద‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement