Saturday, April 27, 2024

WPL | యూపీ వారియర్స్ ముందు ఈజీ టార్గెట్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల‌ (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మహిళల జట్టు తలపడనున్నాయి. కాగా, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో 143 పరుగుల విజయలక్ష్యంతో యూపీ వారియర్స్ జట్టు బరిలోకి దిగనుంది.

కాగా, గుజరాత్ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (35), ఆష్లే గార్డనర్ (30), లారా వోల్వార్డ్ (28) పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక‌ యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గయక్వాడ్ 1 వికెట్ తీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement