Monday, April 29, 2024

ల‌ఢ‌క్‌లో మరోసారి భూకంపం

కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన ల‌ఢ‌క్‌లో వ‌రుస భూకంపాలు వ‌స్తున్నాయి. నిన్న 4.2 తీవ్ర‌త‌తో భూకంపం రాగా, తాజాగా ఇవాళ ఉద‌యం 8.27 గంట‌ల‌కు భూమి కంపించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేలుపై 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) వెల్ల‌డించింది. భూకంపం వ‌ల్ల సంభ‌వించిన న‌ష్టానికి సంబంధించి ఇంకా వివ‌రాలు తెలియ‌రాలేద‌ని పేర్కొంది.
శుక్ర‌వారం ఉద‌యం 11.02 గంట‌ల ప్రాంతంలో కూడా ల‌ఢ‌క్‌లో భూ కంపం వ‌చ్చింది. జ‌మ్ముక‌శ్మీలోని దోడా ప్రాంతంలో నిన్న మ‌ధ్యాహ్నం 2.34 గంట‌ల‌కు భూమి కంపింది. దీని తీవ్ర‌త 3.2గా న‌మోద‌య్యింది ఎన్‌సీఎస్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement