Friday, April 26, 2024

2 లక్షలకు చేరువలో ఎంసెట్‌ దరఖాస్తులు.. ఈనెల 28 వరకు గడువు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. గురువారం సాయంత్రం వరకు 1,94,008 మంది ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,23,565 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలకు 70,443 మంది చేసుకున్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28 వరకు గడువు ఉంది. జులై 14, 15 తేదీలలో అగ్రికల్చర్‌, జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష జరగనుంది. ఈ సారి ఎంసెట్‌కు దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. దాదాపు 3 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement