Friday, May 17, 2024

తెలుగు తేజానికి గోల్డ్ మెడల్.. హర్యానా సీఎం నుంచి అందుకున్న డాక్టర్ సింధూజ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు తేజాన్ని గోల్డ్ మెడల్ వరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ డీఎస్వీ సింధూజ బీడీఎస్‌లో బంగారు పతకాన్ని సాధించింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సూధాకర్‌రావు సుప్రీంకోర్టులో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె డీఎస్వీ సింధూజ హర్యానా ఫరీదాబాద్‌లోని మానవ్ రచన డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. శనివారం రోహ్‌తక్‌లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా సింధూజ గోల్డ్ మెడల్ అందుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమెను అభినందించారు. సింధూజ విజయం తెలుగు వారందరికీ గర్నకారణమని కొనియాడారు. వేలాది మంది విద్యార్థులతో పోటీపడి సింధూజ బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement