Friday, May 10, 2024

25 నుంచి దోస్త్‌ ప్రత్యేక డ్రైవ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఈనెల 25 నుంచి 28 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈనెల 26 నుంచి 28 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశమిచ్చారు. ధ్రువపత్రాలను ఈనెల 28న పరిశీలంచనున్నారు. ఈనెల 29న సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి 31 వరకు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏ విడతలోనూ సీటు పొందని విద్యార్థులు స్పెషల్‌ డ్రైవ్‌కు అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరు రూ.400 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement