Wednesday, May 1, 2024

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు: డీకే అరుణ

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారనే విషయం ప్రజలందరికీ అర్థమయిందన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఆ పథకాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పతకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఇక వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని… ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆరోపించారు. కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి:మరో వివాదంలో శంకర్… “RC 15” తిప్పలు

Advertisement

తాజా వార్తలు

Advertisement