Monday, April 29, 2024

TS : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్… నేడు బ్లడ్ శాంపిల్స్‌ సేకరణ….

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కేసు ఎఫ్ఐఆర్‌ గచ్చిబౌలి పోలీసులు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు న‌మోదైంది. కాగా, నేడు క్రిష్‌ను డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

అయితే, విచార‌ణ‌లో భాగంగా క్రిష్ బ్లడ్ శాంపిల్స్‌ పోలీసులు సేకరించనున్నారు. గతంలో వివేక్ నిర్వహించిన పార్టీల్లో క్రిష్ ఉన్నారా..? అని పూర్థి స్థాయిలో దర్యాప్తును గచ్చిబౌలి పోలీసుల ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కి ముగ్గురు నిందితుల ఫోన్లను పోలీసులు పంపారు. విచారణలో పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఇప్పటికే వివేకానందకు అబ్బాస్ అలీ.. డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement