ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రీల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్ తో ఎంతో మంది కన్నుమూయగా తాజాగా చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు దర్శకుడు మణి నాగరాజు. ఈయన దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నేతాండి వరుసవాయ చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాష్ కుమార్, శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం వాసువిన్ కర్పైణేగన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స్థానిక పలసరవాక్కంలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నాగరాజు మృతి చిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురి చేసిందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement