Thursday, April 18, 2024

ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్న ధోనీ

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ చాలా గ్యాప్‌ తర్వాత మళ్లిd బ్యాట్‌ పట్టుకున్నాడు. ఇప్పటి నుంచే ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గతేడాది ధోనీ చక్కగా రాణించాడు. వయసు పెరుగుతున్నా తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు.
ఆటగాడిగా ధోనికి వచ్చే ఐపిఎల్‌ చివరిదని ప్రచారం సాగుతుంది.

వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌లో ధోని ఆడటం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్‌మెంట్‌ తీసుకుంటానని ధోని గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు తన చివరి మ్యాచ్‌ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్టుతోనే ధోని ఉంటాడని, మెంటార్‌గానో లేక కోచ్‌గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement