Friday, July 26, 2024

Delhi | అమరావతి రూపురేఖలు మార్చాలి.. చంద్ర‌బాబుకు జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఢిల్లీ నివాసంలో… జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కాగా, ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డ రైతులు, ప్రజలు… తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీయే విజయంతో మానసిక విజయం సాధించార‌ని అన్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేయగానే.. రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలని, అమరావతి రూపురేఖలు మార్చాలని చంద్రబాబును కోరారు.

అలాగే ప్రభుత్వ పోలీసు శాఖలో హోంగార్డు, పోలీసు కానిస్టేబుళ్లు, ఇంటెలిజెన్స్ అధికారులు, సీఐల నుంచి అనేక సౌకర్యాలను గత ప్రభుత్వం పూర్తిగా చెల్లించకుండా నిలిపివేసిందని… ఈ విషయాల్లో ఓ కమిటీ వేసి వారికి పూర్తి న్యాయం చేయాలి కోరారు. ఇక, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి వర్గానికి బీసీ సంక్షేమ సంఘం తరపున కర్రి వేణుమాధవ్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement