Saturday, May 11, 2024

కస్టమ్స్​ చెకింగ్​.. ఢిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న వ్యక్తి వద్ద విదేశీ కరెన్సీ స్వాధీనం

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 41.8 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్‌కు వెళ్తున్న భారతీయ ప్రయాణికుడి నుండి ఈ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ ప్రయాణికుడు గురువారం IX-141 విమానంలో న్యూఢిల్లీ నుండి దుబాయ్ వెళ్లాలని అనుకున్నాడు. కస్టమ్స్​ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. అతనితో పాటు లగేజీని తనిఖీలు చే చేయడంతో నిందితుడి బ్యాగ్‌లలో ఒకదాని నుండి విదేశీ నోట్లు బయటపడ్డాయి. కస్టమ్స్ యాక్ట్​ 1962లోని సెక్షన్ 110 కింద మొత్తం 52,900డాలర్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అదే చట్టంలోని సెక్షన్ 104 కింద నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement