Saturday, July 27, 2024

Delhi | సోనియాతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ…

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హసీనా సోమవారం స్వదేశానికి తిరిగి వెల్తుండ‌గా.. హస్తినలో సోనియా కుటుంబ సభ్యులతో భేటీ కావడం ప్రాధాన్యత తరించుకుంది. హసీనా, సోనియా భేటీలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్‌ హసీనా ఆదివారం జరిగిన ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే హసీనా, గాంధీ కుటుంబానికి మధ్య ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. ఆ దేశ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడంతో అప్పటి నుంచి ఇందిరా కుటుంబంతో వారికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement