Monday, April 29, 2024

CWG 2022 టేబుల్ టెన్నిస్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న స‌త్యన్ జ్ఞానశేఖరన్..

ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ సత్యన్ జ్ఞానశేఖరన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. భారత స్టార్ ఇంగ్లిష్ ఆటగాడు పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి తన జట్టు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లో ఈ రోజు (సోమవారం) జరిగిన ఈ మ్యాచ్ లో సత్యన్ జ్ఞానశేఖరన్ 4-3తో ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌ను ఓడించి పురుషుల సింగిల్స్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్ కి ఇదే తొలి పతకం.

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న CWGలో భారతదేశం టీడ్ తో ముందుకు సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ 58 ప‌త‌కాలు సోంతం చేసుకోగా అందులో 20- స్వ‌ర్ణ ప‌త‌కాలు, 15- సిల్వర్ ప‌త‌కాలు, 23- కాంస్యం ప‌తాకాలు ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement