Tuesday, April 30, 2024

Cricket – అశ్విన్, కుల‌దీప్ ల‌ మాయ … 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లండ్

భార‌త్ టార్గెట్ 192 ప‌రుగులు
రెండో ఇన్నింగ్స్ లో స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్…
10 వికెట్లు కూల్చేసిన స్పిన్ త్ర‌యం ..
అశ్విన్ కు పాంచ్ ప‌టాకా..
కుల‌దీప్ కు నాలుగు వికెట్లు
తొలి ఇన్నింగ్స్ జురెల్ సూప‌ర్ నాక్..
307 ప‌రుగుల‌కు భార‌త్ అలౌట్ ..

రాంచిలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. . భార‌త్ స్పీన్ ఉచ్చులో చిక్కుకుని మొత్తం 10 వికెట్లు కోల్పోయింది.. . తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులతో క‌లుపుకుని ప్ర‌స్తుతం 191 ప‌రుగుల అధిక్యంలో ఇంగ్లండ్ ఉంది.. భార‌త్ ఈ టెస్ట్ మ్యాచ్ లో విజ‌యం సాధించాలంటే 192 ప‌రుగులు చేయాల్సి ఉంది..ఈ మ్యాచ్ లో అశ్వీన్ అయిదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా… కుల‌దీప్ నాలుగు, జ‌డేజాకు ఒక్క వికెట్ ద‌క్కింది.. ఇంగ్లండ్ జ‌ట్టులో క్రాలే ఒక్క‌డే 50 ప‌రుగుల మార్క్ ను దాటాడు.. మిగిలిన వారంద‌రూ త‌క్కువు స్కోర్ కే వెను తిరిగారు..

ఇది ఇలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 307 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 219/7తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. మరో 88 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. ధ్రువ్‌ జురెల్‌(90) చివరి వరకూ పోరాడి.. శతకానికి చేరువలో హార్ట్‌లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్‌ (73) మరోసారి ఆకట్టుకోగా.. గిల్‌ 38, కుల్‌దీప్‌ 28 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement