Friday, May 17, 2024

క్రికెట్ బెట్టింగ్ బుక్కీ అరెస్ట్.. ఎపి,తెలంగాణలో మూడేళ్ళుగా ఐపీఎల్ బెట్టింగ్స్..

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ కేంద్రంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న క్రికెట్ బుక్కీని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇవ్వాల (గురువారం) అరెస్ట్ చేశారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ ను విస్తరింపజేసి, మూడేళ్ళుగా దందాను నిర్విరామంగా, నిరాటంకంగా సాగిస్తున్న చట్ట విరుద్ధమైన బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. క్రికెట్ బుక్కీ.. కాస లక్ష్మణ్ రావు (43) నుండి 4 లక్షల 11 వెల 720 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 45 వేల విలువ చేసే డెల్ కంపెనీ ల్యాప్ టాప్, ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు.

- Advertisement -

వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలి మండలం శాలిపేట గ్రామానికి చెందిన కాస లక్ష్మణ్ రావు సునాయాసంగా డబ్బులు సంపాదించేందుకు తనకున్న అలవాటునే వ్యాపారంగా మార్చుకొని అక్రమార్జనకు తెర లేపాడు. క్రికెట్ పై ఉన్న మమకారం, ఆసక్తినే క్రికెట్ బెట్టింగ్స్ కు తెర లేపి, తన క్రికెట్ బెట్టింగ్ దందా వ్యాపారాన్ని క్రమంగా విస్తరింపజేసుకున్నాడు. అదే క్రమంలో ఆన్ లైన్ యాప్స్ సంస్థలతో ఒప్పందం చేసుకొని క్రికెట్ బుక్కీగా అవతారమెత్తి, బిజినెస్ మరింతగా విస్తరింప చేసుకొన్నాడు. అందులో భాగంగానే తన మకాంను హన్మకొండకు మార్చి.. హన్మకొండకి చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం చేసుకొని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరును పెంచాడు. ఇటీవల హన్మకొండ వాసి పోలీసులకు పట్టుబడగా, కాస లక్ష్మణ్ రావు పరారీ అయ్యాడు. కాగా, పథకం ప్రకారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కాస లక్ష్మణ్ రావును అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ దందాకు చెక్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement