Friday, May 3, 2024

Covid Update : స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త‌గా 2,208 మందికి పాజిటివ్

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి.. నిన్న‌టి వ‌ర‌కు వెయ్యిలోపు న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేడు ఏకంగా రెండువేలు దాటింది. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. గత 24 గంటల్లో 1,42,704 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,208 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,398 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,999కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement