Sunday, April 28, 2024

Covid Update : దేశంలో త‌గ్గిన క‌రోనా.. కొత్త కేసులు ఎన్నంటే?

దేశంలో క‌రోనా త‌గ్గుతూ వ‌స్తుంది.. వెయ్యిలోపే రావ‌డంతో వైద్యులు క‌రోనా అదుపులోనే ఉందంటున్నారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. గ‌త కొంత కాలంగా క‌రోనా కేసుల సంఖ్య వెయ్యిలోపే న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశంలో 1,082 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,59,447కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,200 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 7 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,486కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement