Saturday, April 27, 2024

కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దు..!: కేంద్ర ప్రభుత్వ యోచన

కరోనా వ్యాక్సిన్లపై వస్తు సేవల పన్ను ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఒక్కో వ్యాక్సిన్ డోసు ధరను రూ.1,200 వరకు తగ్గించాలని యోచిస్తోంది. జీఎస్టీ తగ్గింపుతో వ్యాక్సిన్ ధర తగ్గుతుందని, దాని వల్ల ప్రైవేటులో ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కరోనా ఔషధ ముడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అదే రీతిలో కరోనా వ్యాక్సిన్లపై ఉన్న 5 శాతం జీఎస్టీనీ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దును జీఎస్టీ మండలి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో మండలిలోని సభ్యులెవరూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవచ్చు. కేంద్రం నిర్ణయంతో అన్ని రాష్ట్రాల ప్రజలకు లబ్ధి కలుగుతుంది. వ్యాక్సిన్లపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని ఓ అధికారి చెప్పుకొచ్చారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా వ్యాక్సినేషన్ లో చురుగ్గా పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement