Thursday, May 2, 2024

ఒక్క డోసు తీసుకున్నా.. మరణాల నుంచి 92 శాతం రక్షణ

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే మహమ్మారి మరణాల ముప్పును 98 శాతం తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క డోసు తీసుకున్నా ఆ ముప్పు 92 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ తీసుకున్న పోలీసులపై చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని తెలిపింది. ఆ అధ్యయన సమచారాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు.

35,856 మంది పోలీసులు ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకుంటే.. అందులో కరోనా సోకి 9 మంది చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిలో కరోనాతో చనిపోయింది 0.25 శాతమేనని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న 42,720 మందిలో కేవలం ఇద్దరే (0.05%) చనిపోయారన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోని 4,868 మంది సిబ్బందిలో 15 మంది మృత్యువాత పడ్డారన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తీవ్రత తగ్గడమే కాకుండా మరణాల ముప్పునూ గణనీయంగా తగ్గించొచ్చని, అందరూ ధైర్యంగా టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement