Friday, May 3, 2024

Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కొత్తగా 5910 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,007 మంది బాధితులు మరణించారు. మరో 53,974 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7034 మంది కోలుకోగా, 9 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 213.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement