Monday, May 6, 2024

35 శాతం మేర పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లి : దేశంలో గత రెండురోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 3,712 కొత్త కేసులు నమోదయ్యాయని, ముందురోజుతో పోలిస్తే 35.22 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రకటించింది.

ఇదే సమయంలో జాతీయ పాజిటివిటీ రేటు0.84 శాతం మేర పెరిగిందని, ముందురోజుతో పోలిస్తే 0.24 శాతం అధికమని తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తంమీద 18,386 క్రియాశీల కేసులున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య రాజధాని ముంబైలో అత్యధికంగా 739 కేసులు నమోదయ్యాయని, ఫిబ్రవరి 4వ తేదీ తరువాత ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement