Monday, May 6, 2024

పుణ్యస్నానాలకు వచ్చి అనంత లోకాలకు..

జగిత్యాల : ధర్మపురి గోదావరి పుణ్య స్నానాలకు వచ్చిన ఓ బాలుడు అనంత లోకాలకు వెళ్ళాడు. నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన కార్తీక్ అనే బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురి పుణ్యక్షేత్ర సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బాలుడు గోదావరి లోతు తెలియక సత్యవతి గుండంలో మునిగి మృతి చెందాడు. స్థానికులు బాలుని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీంతో బాలుడు కుటుంబంలో విషాద ఛయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement