Tuesday, October 22, 2024

TG | ఉట్కూరు హత్యపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు

నారాయణపేట జిల్లా ఊట్కూరులో జరిగిన హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో పొలం వద్ద సంజీవ్ అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సంజీవ్‌ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అరాచకాలు, హత్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement