Monday, May 20, 2024

TS | లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళి..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు సీఎం వెంట ఉన్నారు.

పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement