Friday, May 3, 2024

గురువులకు టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపిన‌ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్య నేర్పే గురువులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారని సీఎం అన్నారు.

సమాజాభివృద్ధికి విద్యయే మూలమనే మహనీయుల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement