Monday, April 29, 2024

ఉపరాష్ట్రపతి ఇంట పెళ్లి సందడి.. హాజరైన కేసీఆర్, చంద్రబాబు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు హాజరయ్యారు. ఇక, తెలుగు చిత్రసీమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్, అక్కినేని నాగార్జున తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement