Friday, April 26, 2024

జూలై 8న ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ ప్రారంభం: మంత్రి బొత్స

ఆస్తి విలువ ఆధారిత పన్ను నిర్ణయం ఎన్నికల ముందు నాటిదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని చెప్పారు. యూజర్ ఛార్జీపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. జూలై 8న ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మంత్రి బొత్స ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైందని, చట్టానికి, రాజ్యాంగానికి లోబడే వికేంద్రీకరణ పక్రియ చేపట్టామని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు రాజధాని తరలింపునుకు అడ్డుపడుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement