Sunday, April 28, 2024

Sabarimala | అయ్యప్ప కొండకు భ‌క్తుల తాకిడి.. దర్శనం సమయం పొడిగింపు !

శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి తరలివస్తున్న భక్తులతో కొండలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో త్వరితగతిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా సమయాన్ని ఆలయ బోర్డు పెంచింది.

సాధారణంగా దర్శనాలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగుస్తాయి. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు బదులుగా 3 గంటలకు తగ్గించారు. దీంతో దర్శన సమయం గంట పెరిగింది. ఇక నుంచి రెండో దశ దర్శనాలు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement