Thursday, April 25, 2024

చిట్టిత‌ల్లీ.. నీకెంత క‌ష్టం..

వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన దోమకొండ కావేరి పుట్టెడు దుఃఖంలోనూ టెన్త్ ఎగ్జామ్ రాసింది. రుద్రూర్ మండలం కోటయ్య క్యాంపులోని ఆదర్శ పాఠ‌శాలలో పదవ తరగతి చదువుతున్న కావేరి గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు హాజరైంది. ఓ పక్క కావేరి తండ్రి సాయిలు ఉదయం అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ సదరు విద్యార్థిని పరీక్షకు హాజరు కాక తప్పలేదు. అటు తండ్రి మరణ వార్త తెలిసినప్పటికీ పుట్టెడు దుక్కాణ్ణి దిగమింగుకుని పరీక్షకు విద్యార్థిని హాజరు కావడం పలువుర్నిని కలచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement