Saturday, May 18, 2024

ఇందిరాదేవి మృతికి సంతాపం తెలిపిన చిరంజీవి..చంద్ర‌బాబు

సూప‌ర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. మరోవైపు ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రముఖ నటులు కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసికశక్తిని కుటుంబసభ్యులకు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని… ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసిందని అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని… సూపర్ స్టార్ కృష్ణగారికి, సోదరుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement