Friday, May 10, 2024

హ్యాండ్లూమ్​ చైర్మన్​గా చింతా నియామకంపై​ సంబురాలు.. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్న లీడర్లు

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): తెలంగాణ హ్యాండ్ల్యూమ్​ సంస్థ చైర్మన్​గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన చింతా ప్రభాకర్​ను నియమించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో టీఆర్​ఎస్​ పార్టీ కేడర్​, చింతా అనుచరులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుంటూ సందడి చేశారు.

జిల్లా టీఆర్ ఎస్ కేడర్ చింతా నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఐబీ గెస్ట్ హౌస్ వద్ద సోమవారం హడావుడి చేశారు. ‘‘చింతా ప్రభాకారన్న జిందాబాద్’’ అనే నినాదాలతో టౌన్​ మొత్తం మారుమోగింది. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క నాగరాజ్ గౌడ్, జలంధర్, ప్రభు గౌడ్, సాయి గౌడ్​తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement