Monday, May 6, 2024

TS | సీఎం రేవంత్ తో త్రిదండి చిన జీయర్ స్వామి భేటీ..

ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ముచ్చింతల్లో సమతాకుంభ్ ఉత్సవాలకు రావాలని రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామానుజ జీవిత విశేషాలను చిన జీయర్ వివరించారని సమతాకేంద్ర వర్గాలు తెలిపాయి. ఆయన విజ్ఞప్తికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి. ఇక భేటీ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ వెంట భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement